చరిత్రలో సులువైన ఛేదన ఇదేనా..భారత్‌

235
- Advertisement -

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే భారత జట్టు మాజీ ఆటగాళ్లే కాకుండా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సైతం టీమిండియాపై విమర్శలు చేసింది. ట్వీట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చరిత్రలో అతి సులువైన ఛేదన ఇదేనా..? అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు..భారత్‌ బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు మరోసారి విఫలమవడంతో భారత్‌ నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168పరుగులు చేయగలిగింది.అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 170 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి..

ప్రశాంతంగా హిమాచల్ పోలింగ్..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అరెస్ట్..

గ్రీన్ ఛాలెంజ్‌లో డా.మార్కండేయులు

- Advertisement -