కేరళ అడవుల్లోనే ‘పుష్ప’ షూటింగ్..

234
Allu Arjun
- Advertisement -

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీతో భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సుకుమార్‌ డైరెక్షన్‌లో ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నాడు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ గురించి ఓ కొత్త అప్ డేట్ వినిపిస్తోంది.

ఈ చిత్రం షూటింగును ముందుగా కేరళ అడవులలో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదేసమయంలో కరోనా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్‌ అగిపోయింది. ఇక పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడవని భావించి ఈ చిత్ర బృందం మహబూబ్ నగర్ అడవుల్లో చేద్దామని అంతా సిద్ధం చేసుకున్నారు.తక్కువ మంది యూనిట్ సభ్యులతో.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్కడ షూటింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పటికీ,ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు విరమించుకున్నట్టు తెలుస్తోంది. మొదట్లో అనుకున్నట్టుగా కేరళ అడవుల్లోనే చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో నవంబర్ మొదటి వారంలో కేరళ అడవుల్లో ఈ చిత్రం షూటింగును మొదలెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -