రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..

69
- Advertisement -

రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో దేశంలో ఒక రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. *జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, భోన్ గిర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటయ్యాయి.

ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది తెలంగాణ. 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.

Also Read:మల్లన్న సన్నిధిలో మంత్రి హరీశ్..

రాష్ట్రంలో పది వేలకు చేరువ కానున్నాయి ఎంబీబీఎస్ సీట్లు. మారుమూల ప్రాంతాలకు సైతం చేరువయ్యాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని వ్యాఖ్యానించారు.

Also Read:బండి సంజయ్‌పై లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -