దేశంలో 24 గంటల్లో 4510 కరోనా కేసులు

30
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 4510 కరోనా కేసులు నమోదుకాగా 14 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,47,599కి చేరగా 4,39,72,980 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 46,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,28,403 మంది మృతిచెందారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.33 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.10 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 216.95 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -