బ్యాక్‌ టూ వర్క్‌ :మహేష్‌

205
- Advertisement -

టాలీవుడ్‌ జెమ్స్‌బాండ్, సూపర్ స్టార్‌ కృష్ణ ఆకాల మరణంతో సినీ పరిశ్రమ పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఘట్టమనేని కుటుంబ సభ్యులు రమేష్‌బాబు, ఇందిరాదేవి, కృష్ణ మరణాలతో మహేష్‌బాబు శోకసంద్రంలో మునిగిపోయాడు. ఇక షూటింగ్స్‌ నుంచి విరామం తీసుకున్న మహేశ్, తండ్రి అంత్యక్రియలు,పెద్దకర్మ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అయితే గత కొన్ని రోజులు మహేష్‌బాబు సినిమా షూటింగ్‌ ఆపి ఏకాంతంగా గడపాలని ఆనుకుంటున్నారని టాలీవుడ్‌లో టాక్‌.

దీంతో ఇంట్లోనే ఉంటే మహేష్ మరింత దుఃఖంలోకి వెళ్తాడని గమనించిన త్రివిక్రమ్…మహేష్‌ను ఓదార్చుతు సినిమా షూటింగ్ వైపు మనసు మళ్ళించేలా ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే బ్యాక్‌ టూ వర్క్ అంటూ మహేష్ ట్వీట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ రెండవ షెడ్యూల్‌ ప్రారంభం కాకముందే సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణించారు.

ఇవి కూడా చదవండి…

అందరి కళ్ళు వీరయ్య మీదే

తారక్ సినిమా కోసమే పుట్టాడు:జక్కన్న

కుర్ర హృదయాలను కూల్చేసింది !

- Advertisement -