ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు…

284
- Advertisement -

బీజేపీ దుష్టరాజకీయాలను ఎదుర్కొనడానికి తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సిద్దమైంది. తప్పుడు కేసులతో టీఆర్‌ఎస్‌ నాయకులను భయపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్న బీజేపీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహాజ్వాలలతో రగిలిపోతున్నారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎటువంటి సంబంధం లేకుండానే తన పేరును చార్జ్‌షీట్‌లో నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితకు మద్దతు పలుకుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి.   ముఖ్యంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. టీఆర్ఎస్‌ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్‌ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, తదతర ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే వేదింపులకు గురి అవుతున్న తమ అభిమాన నాయకురాలు స్వచ్ఛంగా వాటిని చేదిస్తుందని అన్నారు. చైతన్యం తో కూడిన తెలంగాణ లో విద్వేష పూరిత ప్రసంగాలతో ఓ వైపు ప్రజలను రెచ్చగొట్టే నాయకులను త్వరలో తరిమి కొడతారని అన్నారు. రాష్ట్రాభివృద్ది ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులను వేధిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని అరవింద్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి…

సీబీఐ లేఖకు స్పందించిన :కవిత

ధరణితో రైతు కష్టాలు దూరం:హరీశ్

సైబర్‌ నేరాలను అరికట్టాము:కేటీఆర్‌

- Advertisement -