మహేష్ సినిమా పై క్రేజీ అప్‌డేట్

13
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB28. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత మొదలు కానుంది. జనవరి రెండవ వారం నుంచి మార్చి వరకు ఒక లాంగ్ షెడ్యూల్‌ను త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ షెడ్యూల్ దాదాపు 60 రోజుల పాటు ఉండనున్నట్లు సమాచారం.

ఇక ఈ మూవీ కథేంటి ? జోనర్ ఏంటీ ? అనే ప్రశ్నలు అభిమానులను తొలిచేస్తున్నాయి. ఐతే, ఇదొక పొలిటికల్ అడ్వెంచర్ అని, ఇంకా స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ – త్రివిక్రమ్ గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మహేష్ తో త్రివిక్రమ్ సినిమా అంటే.. భారీ యాక్షన్ తో పాటు భారీ తారాగణం కూడా ఉంటుంది.

అందుకే, ఈ మూవీలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో మహేష్-పూజా కాంబినేషన్ లో మహర్షి చిత్రం తెరకెక్కింది. అది సూపర్ హిట్ అయినట్టే.. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. అలాగే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను సెకండ్ లీడ్ గా తీసుకోనున్నారు. ప్రధాన విలన్ గా సంజయ్ దత్ ను తీసుకోబోతున్నారు.

ఇవి కూడా చదవండి…

బిగ్ బాస్ 7కి బాలకృష్ణ హోస్ట్

డిసెంబర్‌24..మా బావ మనోభావాలు సాంగ్‌

పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్

- Advertisement -