బాహుబలి అందించిన విజయంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది నటి రమ్యకృష్ణ. ఒకప్పుడు నీలాంబరిగా మెప్పించి తనదైన నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ బాహుబలితో రెండో ఇన్నింగ్స్ లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
రాజమాత శివగామిగా నా మాటే శాసనం అంటూ ఆ పాత్రను తాను తప్పా ఇంకెవ్వరూ చేయలేరేమో’ అంటూ ప్రశంసలు అందుకుంది. బాహుబలి తర్వాత కొత్త సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటోంది. ‘బాహుబలి’ తరువాత ఆమె ‘మాతాంగి’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 10.25కు విడుదల చేస్తామని మాతాంగి సినిమా యూనిట్ ఈ రోజు తెలిపింది. గతంలో దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన అమ్మోరు సినిమాలో అమ్మోరుగా రమ్యకృష్ణ కనిపించిన సంగతి తెలిసిందే. మాతాంగి సినిమా పోస్టర్లోనూ రమ్యకృష్ణ అమ్మోరులా తీక్షణమైన కళ్లతో ఉన్న రూపంలో కనపడుతోంది. వినయ కృష్ణన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి కణ్ణన్ తమరకులం దర్శకత్వం వహిస్తున్నారు.