Rahul:వైఎస్ స్పూర్తితోనే భారత్ జోడో యాత్ర

17
- Advertisement -

తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు స్పూర్తి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మాట ఇస్తే మడమ తిప్పని నేతగా గుర్తింపు తెచ్చుకున్న వైఎస్‌ఆర్ 75వ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు రాహుల్.

ఈ సందర్భంగా వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజానీకానికి ఆయన నిజమైన నాయకుడు… ఎప్పుడూ ప్రజల కోసమే బతికిన నేత అని కోనియాడారు. నాడు రాజశేఖర్‌రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే భారత్‌ జోడో యాత్రను చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

వైఎస్ బతికే ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదని…. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావు. వైఎస్‌ఆర్‌ వారసత్వాన్ని షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం అవుతుందని…వైఎస్‌ఆర్‌లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశాను అని కొనియాడారు.

Also Read:YSR:హ్యాపీ బర్త్ డే..రాజన్న

- Advertisement -