స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటీష్ పాలకు వ్యతిరేకంగా నేషనల్ హెరాల్డ్ పత్రికను స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించారు అన్నారు మాజీ ఎంపీ వీహెచ్. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రజలంతా విశ్వసించారు… నేషన్లు హెరాల్డ్ లో మనీలాండరింగ్ చేశారని సోనియా రాహుల్ గాంధీ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసం? అన్నారు.
సోనియా రాహుల్ గాంధీలను టచ్ చేస్తే దేశంలో బీజేపీ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది… గతంలో జనతా పార్టీ చేసిన తప్పు ఇప్పుడు బిజెపి ప్రభుత్వం చేస్తుంది అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ కులగణ జరిగింది… బీసీ కుల గణనతో దేశంలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది అన్నారు. బీసీ లకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది అన్నారు.
బీసీ కులగణన చేపట్టిన సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపేందుకు సభ ఏర్పాటు చేసుకుందాం… కృతజ్ఞత సభ బీసీ కులసంఘాలు అంతా తరలిరావాలి అన్నారు.మోడీ అమిత్ షా సోనియా గాంధీ రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు…సోనియా రాహుల్ ని టచ్ చేస్తే దేశంలో కాంగ్రెస్ సర్కార్ వస్తుంది అన్నారు. అదానీ విజయ మాల్యా పై కూడా మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి వాటి పైన విచారణ జరపాలి అన్నారు.
Also Read:దండులా పార్టీ ఆవిర్భావ సభకు కదలండి: కేటీఆర్

