రాహుల్ పప్పు కాదు: రఘురాం

46
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పప్పు కాదన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. నెల రోజుల క్రితం రాహుల్‭తో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన.. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.

బీజేపీ నేతలు రాహుల్‌ని పప్పు అంటారు.. రాజకీయ పరిపక్వత లేదని, ఇన్నేళ్లు వచ్చినా తల్లి చాటు బిడ్డే అంటూ ఎద్దేవా చేస్తుంటారు. అయితే అవన్నీ అవాస్తవమని, రాహుల్ పప్పు కాదని, వాస్తవానికి చాలా తెలివైన వ్యక్తని కొనియాడారు.

గత పదేళ్లుగా నేను అతడితో మాట్లాడుతూనే ఉన్నాను. కొంత మంది అంటున్నట్లు అతడేమీ పప్పు కాదు. అతడు చాలా తెలివైన వ్యక్తి. యువరక్తం ఉన్నవాడు, అలాగే ఎంతో ఉత్సాహంతో, ఆశతో ఉండే వ్యక్తి. తనను తాను మలుచుకోవడానికి, మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడన్నారు. భారత్ జోడో యాత్రలో తాను చేరింది, ఆ యాత్రలోని విలువలేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనేనని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -