ఎన్టీఆర్‌..రెడ్‌కార్పెట్‌పై మేం కాదు భారతీయులు…

49
- Advertisement -

టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేడుకల్లో హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్ చేరుకున్న ఎన్టీఆర్‌… అక్కడి అభిమానులతో చిట్‌చాట్ నిర్వహిస్తూ అభిమానులతో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఓ విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ…రెడ్‌కార్పెట్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రెడ్ కార్పెట్‌పై నడిచేది ఎన్టీఆర్ లేదా కొమురంభీమ్ అని నేను అనుకోను రాజమౌళి రామ్ చరణ్ అని కూడా అనుకోవడం లేదు.

రెడ్ కార్పెట్‌పై నడిచేటప్పుడు మేము మొత్తం భారతదేశాన్ని మా హృదయాల్లో ఉంటారని అన్నారు. నేను ఇలాంటి క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. ఆస్కార్‌ వేదికపై నాటునాటు సాంగ్‌కు డ్యాన్స్‌ చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేము మా పనుల్లో బిజీగా ఉండటం వల్ల ప్రాక్టీస్‌ చేయలేదు. కానీ ఆ పాట విన్న ప్రతిసారీ మా కాళ్లు చేతులు డ్యాన్స్‌ చేస్తూ ఉంటాయని అన్నారు.

ఆర్ఆర్ఆర్‌ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలి అంటూ సినమాపై అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

‘బలగం’ కలెక్షన్స్ ఎంతంటే?

తమ్మారెడ్డిపై నాగబాబు షాకింగ్ కామెంట్స్..

పుష్ప 2లో లేను.. మీటూ పై స్పందన ఇదే

- Advertisement -