ప్రకృతి ఒడిలో సేద తీరిన ముద్దుగుమ్మలు

181
- Advertisement -

అద్భుతమైన ప్రకృతి అందాలకు అందమైన ముద్దుగుమ్మలు కూడా దాసోహం అవ్వాల్సిందే. చుట్టుపక్కల ప్రకృతి అందాలు అంతా పరుచుకుని ఉంటే.. తమ ఎద లోతుల్లో నుంచి అనుభూతి తన్నుకొస్తోంది అంటుంటారు కొందరు. మేము కూడా ఇదే కోవకు చెందాం అంటున్నారు క్రేజీ హీరోయిన్స్. ప్రకృతి ఒడిలో ప్రయాణం కోసం అర్రులు చాస్తూ ముందుకు కదిలారు ఇద్దరు ముద్దు గుమ్మలు. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను హీరోయిన్ తమన్నా చాటుతుంది.

అది అలా ఉంటే ఈ భామ మార్నింగ్ వాక్‌ను ఎంజాయ్ చేస్తోన్న కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉదయించే ఎర్రటి సూర్యుడిని చూస్తూ.. పచ్చని పకృతి అందాలను తమన్నా మనసారా ఆస్వాదిస్తూ కనిపించింది. ఇక తమన్నా , నటుడు విజయ్ వర్మల మధ్య ఏదో రిలేషన్ ఉందని హిందీ మీడియా కోడై కూస్తోంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు ఫ్యాన్స్.

అలాగే మరో ముద్దుగుమ్మ విషయానికి వస్తే.. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా తాజాగా పకృతి అందాలను ఆస్వాదిస్తున్న కొన్ని ఫోటోలను పంచుకుంది. అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇటీవల ప్యారిస్ పర్యటనకు రాశీ ఖన్నా వెళ్ళింది. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. మొత్తానికి పారిస్ లో రాశీ ఖన్నా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. రాశీఖన్నా ప్రస్తుతం హిందీలో ఫర్జ్ అనే వెబ్ సిరీస్‌తో పాటు యోధ అనేసినిమాలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -