ఓటేసిన కసూకుంట్ల..

125
kusukuntla
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక నారాయణపూర్ మండలంలోని తన స్వగ్రామమైన లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

సాయంత్రం 6 గంటల పోలింగ్ కొనసాగనుండగా 2.41లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించగా.. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ క్యాస్టింగ్‌ చేయడంతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -