బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 59 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్లో భాగంగా ఏకంగా కర్రలు ఇచ్చి కొట్టుకోమని బిగ్ బాస్ చెప్పగా రచ్చరచ్చ చేశారు కంటెస్టెంట్స్.
ఓ టాస్కులో భాగంగా ఇంటి సభ్యులను రెడ్ టీం అండ్ బ్లూ టీంగా విడగొట్టారు. ఈ టాస్క్ లో భాగంగా రెడ్ టీం వాళ్ళు ముగ్గురు, బ్లూ టీం వాళ్ళు ముగ్గురు ఎదురెదురుగా గోడల మీద నిలబడతారు. వీరికి కర్రలు ఇస్తే ఆ కర్రలతో కొట్టుకుంటూ అవతలి వాళ్ళని గోడ మీద నుంచి పడేయాలని తెలిపారు.
దీంతో రెడ్ టీం నుంచి రేవంత్, ఫైమా, శ్రీహన్ బరిలోకి దిగగా బ్లూ టీం నుంచి మెరీనా, వాసంతి, ఇనయాలు దిగారు. దీంతో ఇనయ, శ్రీహాన్ మధ్య పెద్ద గొడవ జరిగింది.శ్రీహాన్ ని ఉద్దేశించి నువ్వు శ్రీసత్యతో బెడ్ మీద పడుకుంటావు అని అనడంతో శ్రీసత్య కూడా ఇనయాతో గొడవకు దిగింది. తర్వాత బాలాదిత్య లైటర్ గీతూ దొంగతనం చేయడంతో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇక చివర్లో ఆదిరెడ్డిని బిగ్బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ఆదిరెడ్డికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బాత్ రూమ్ ని డర్టీగా మార్చి రెడ్ టీం సభ్యులలో ఒకరిపై నింద వేయాలని, కావాలంటే మీ గ్రూప్ వాళ్ళ సాయం తీసుకోవచ్చని బిగ్బాస్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి..