ఫిబ్రవరి 6.. కియా సిద్ధ్‌ల పెళ్లి

13
- Advertisement -

బాలీవుడ్‌లో మరో జంట ఒక్కటవ్వబోతుంది. బాలీవుడ్ నటులు కియారా అడ్వాణి సిద్ధార్థ్‌ మల్హోత్రలు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారన్న విషయాన్ని కూడా అత్యంత గొప్యంగా ఉంచారు. అయితే త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నట్టు బాలీవుడ్‌ మీడియాలో టాక్.

ఫిబ్రవరి 6వ తేదీన వీరిద్దరూ పెళ్లి…అంతకుముందు ఫిబ్రవరి 4,5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ సంగీత్ లాంటి కార్యక్రమాలు జరగనున్నట్టు టాక్. అయితే పెళ్లి మాత్రం రాజస్థాన్‌లోని జైసల్మీర్లోని ప్యాలెస్‌లో పంజాబీ సంప్రదాయంలో జరుగనున్నట్టు సమాచారం. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పలువురు ప్రముఖులు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అతిథుల కోసం ఫైవ్‌స్టార్ హోటల్‌ను అడ్వాన్స్ బుకింగ్‌ చేసినట్టు సమాచారం.

కాగా వీరిద్దరూ షేర్షా సినిమా ద్వారా కలిసి తొలిసారి స్క్రీన్ పంచుకున్నారు. ప్రస్తుతం కియారా రామ్‌చరణ్‌ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఆర్సీ15లో నటిస్తోంది. తెలుగులో అంతకుముందే వినయ విధేయ రామ, భరత్‌ అనే నేను సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఇవి కూడా చదవండి…

‘ప్రాజెక్ట్ K’ క్రేజీ న్యూస్ పై క్లారిటీ

హిలేరియ‌స్ సీన్ లో మహేష్

టాలీవుడ్‌లో మరో విషాదం..

- Advertisement -