‘ప్రాజెక్ట్ K’ క్రేజీ న్యూస్ పై క్లారిటీ

44
- Advertisement -

ప్ర‌భాస్ హీరోగా, మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె.’ వైజ‌యంతీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో దీపికా ప‌దుకొణె, అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఐతే, ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాలలో వైరల్ అవుతోంది. మేకర్స్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు ఆ రూమర్ల సారాంశం. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ అయిపోయిందని.. ఆ ఫస్ట్ పార్ట్ నే వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఐతే, ఈ సినిమా రెండు పార్ట్స్‌లో రానుంద‌ని వస్తున్న వార్త‌ల పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

‘ప్రాజెక్ట్ కె’ రెండు పార్ట్స్ గా రాబోతుంది అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌ని, ప్రాజెక్ట్ కె ఒకే భాగంలో రానుందని నాగ్ అశ్విన్ తన స‌న్నిహితులతో క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే… నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడట. మరి ఆ నేపథ్యం ఏమిటో చూడాలి. ఐతే పక్కా సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్ ఉంది.

అందుకే, ఈ ‘ప్రాజెక్ట్ కె’ కోసం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే పర్యవేక్షకుడిగా పెట్టుకున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ చాలా బాగుంటాయట.

ఇవి కూడా చదవండి…

హిలేరియ‌స్ సీన్ లో మహేష్

టాలీవుడ్‌లో మరో విషాదం..

రీ ఎంట్రీ ఇవ్వనున్న మలయాళీ భామ..

- Advertisement -