విరాట్ కోహ్లికి వింత అనుభవం..

199
Keen fan takes mid-match selfie with Kohli
- Advertisement -

భారత్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్ క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూసర్ తర్వాతి స్ధానం అతనికే దక్కింది. పరుగుల వరదలతో మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న క్రికెటర్. ఇండియాలో మరో సచిన్ గా అతన్ని చూసూకుంటారు. ఏమ్యాచ్ లో అయినా సరే ఒత్తిడి లేకుండా టీం ను విజయపథం వైపు తీసుకెళ్లె ఆటగాడు. ఇటివలే జరగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లలో కూడా తనదైన శైలి కనబరుస్తున్నాడు. టీం మొత్తం విఫలం చెందిన అతడు మాత్రం తన దైన శైలిలో ప్రతిభ కనబరుస్తున్నాడు.Keen fan takes mid-match selfie with Kohli

సాధరణంగా కోహ్లిపై అభిమానం ఉన్నవారు గ్రౌండ్ లలో తమదైన శైలిలో అభిమనం చూపిస్తుంటారు. ఫ్లకార్డు పట్టుకుని గానీ..ఒంటిపై పేర్లు రాసుకోవడం గానీ బ్యానర్లు వంటి పలు రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పరుగుల వర్షం కురిపించాడు కెప్టెన్ విరాట్ కోహ్లి . 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించారు. అయితే కోహ్లి విశ్వ రూపం చూసిన ఓ అభిమాని వింత గా తన అభిమానాన్ని చాటుకున్నాడు.

మ్యాచ్ జరగుతుండగానే అభిమాని స్టేడియం లోపలికి వచ్చి కోహ్లి కాళ్లు మొక్కాడు. సెక్యూరీటి ఉండగానే అతను వారికి కనిపించకుండా గ్రౌండ్ లోపలికి చొచ్చుకొచ్చాడు. అంతటితో ఆగకుండా అతనితో సెల్ఫీ కూడా దిగాడు. ఇది అంతా అందరూ చూస్తుండగానే క్షణాల్లో జరిగిపోయింది. వెంటనే గ్రౌండ్ లోకి చేరుకున్న సిబ్బంది అతడిని బయటకు పంపించారు. ఆట మధ్యలో గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లి కాళ్లు మొక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో దుమ్మరేపుతున్నాయి.

- Advertisement -