టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

163
KCR to announce MLC candidates
- Advertisement -

తెలంగాణలో అధికార పార్టీ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా డి. రాజేశ్వర్, ఫారూక్ హుస్సేన్ పేర్లు ఖరారయ్యాయి.

స్థానిక సంస్థల కోటా కింద ఎంఐఎం పార్టీకి చెందిన సయ్యద్ అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

- Advertisement -