- Advertisement -
మెట్రో రైల్ ప్రయాణికులకు L&T షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో ఉన్నట్లు తెలిపింది L&T మెట్రో సంస్థ.
కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది L&T సంస్థ. ఛార్జీల పెంపు తధ్యమని పేర్కొంది. ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో L&T మెట్రో సంస్థ ఉంది.
ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేసింది మెట్రో సంస్థ.
Also Read:ఏపీ, తెలంగాణ… వెదర్ అప్డేట్
- Advertisement -

