ఎమ్మెల్సీ కవిత దీక్షకు విపక్ష నేతలు

48
- Advertisement -

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మార్చి 10న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా దేశంలోని 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళల హక్కుల కోసం పోరాడే సంఘాలు నేతలు హాజరుకానున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు కవిత.

నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుండి ప్రతినిధులు తమ సంఘీభావం తెలపనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై సందిగ్థతకు తెరపడింది. 15వ తేదీ విచారణకు వస్తానని ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈ లేఖపై ఈడీ స్పందించకపోవడంతో 11వ తేదీన అయినా విచారణకు హాజరవుతానని తెలపగా 11న విచారణకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు ఈడీ అధికారులు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -