మిస్టర్ కళ్యాణ్…విజయం సాధించాలి

27
- Advertisement -

శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. మిస్టర్ కళ్యాణ్ యూనిట్ కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటిని కలవడం జరిగింది.

దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..మార్చి 10న విడుదల కాబోతున్న మిస్టర్ కళ్యాణ్ సినిమా విజయం సాధించాలి, అలాగే నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి గారికి దర్శకుడు పండు కు ఇతర నటీనటులకు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయని అదే కోవలోని మిస్టర్ కళ్యాణ్ చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అమ్మాయిలు మరియు మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా వారికి కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది. ఒక ప్రేత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చెయ్యడం జరిగింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -