టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్..

40
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన నాలుగోటెస్టు ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా ఈ మ్యాచ్‌ను ఇరుదేశాల ప్రధానులు వీక్షించనున్నారు.

ఈ టెస్టు భారత్‌కు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకుంటే భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక ఆసీస్ సైతం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని భావిస్తోంది.

భారత జట్టు:

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లీ,జడేజా,అయ్యార్,కేఎస్ భరత్,అక్షర్ పటేల్, అశ్విన్, షమీ, ఉమేశ్‌ యాదవ్

ఆసీస్ జట్టు:

ఉస్మాన్ ఖవాజా,ట్రావిస్ హెడ్, లబుషింగే,స్మిత్,పీటర్ హ్యాండ్స్‌కాంబ్,కామెరూన్ గ్రీన్,అలెక్స్ క్యారీ, స్టార్క్,లయన్,మర్ఫీ,మథ్యూ

ఇవి కూడా చదవండి..

- Advertisement -