హీరో కార్తీక్‌కు కరోనా.. కియారాకు భ‌యం..!

171
karthik aaryan
- Advertisement -

దేశంలో క‌రోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే ప్రజలు క‌రోనా తగ్గింది కదా అని లైట్‌ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి మళ్ళీ విజృంభింస్తుంది.. ఈ మహమ్మారి సామాన్య ప్రజలతో పాటు సెల‌బ్రిటీల‌ను హడలెత్తిస్తోంది. తాజాగా బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్య‌న్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ప్ల‌స్ సింబ‌ల్ షేర్ చేస్తూ.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త్వ‌ర‌గా కోలుకునేలా ప్రార్ధించండి అని ఆయ‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

అయితే కార్తీక్ ఆర్య‌న్ రీసెంట్‌గా జ‌రిగిన లాక్మీ ఫ్యాష‌న్ వీక్ హీరోయిన్ కియారా అద్వానీ, ప్ర‌ముఖ‌ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి హీరో కార్తీక్‌ ర్యాంప్‌ వాక్‌లో పాల్గొన్నాడు. దీంతో వారిద్ద‌రి కరోనా గుబులు పట్టుకుంది. మ‌రోవైపు రీసెంట్‌గా కియారా, టబులతో కలిసి భూల్ భులైయా 2 అనే సినిమా షూటింగ్‌లోనూ ఈ హీరో పాల్గొన్నాడు. దీంతో అంద‌రిక‌న్నా కియారాకు ఎక్కువ‌గా భ‌యం ప‌ట్టుకుంది. ప్ర‌స్తుతం కియారా క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -