కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలనం..

18
- Advertisement -

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని..ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందిని తెలిపారు. ఆపరేషన్‌ కమలంలో భాగంగా రూలింగ్‌ పార్టీ ఎమ్మెల్యేలను పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

కర్ణాటకలో మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య…తమ పదవులకు రాజీనామా చేసేందుకు మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్‌ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతోపాటు రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా తామే భరిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.

గతంలో కూడా కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్‌ కమలం చేపట్టిందని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా డబ్బు ఆశ చూపుతోందని…ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం

- Advertisement -