28 రాష్ట్రాల్లో గ్రీన్‌ ఛాలెంజ్‌:IVF అధ్యక్షుడు అశోక్

40
- Advertisement -

ఐవీఎఫ్ తరపున దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో పది లక్షల మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్ కి తమవంతుగా ఈ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో భాగస్వాములమవుతామని అన్నారు ఐవీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉప్పల్ లో మొక్కలు నాటారు టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్,ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షులు&ఐవీఎఫ్ జాతీయ కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్,ఐవీఎఫ్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ న్యూ ఢిల్లీ గంజి రాజమౌళి గుప్తా.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ…గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని అభినందించారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించినందుకు ఎంపీ సంతోష్ ని కొనియాడారు.

Also Read:గోపిచంద్ – రవితేజ@ 4

టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి వివిధ రంగాల ప్రముఖులను భాగస్వామ్యం చేసి గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ఎంతో విజయవంతంగా తీసుకువెళ్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమములో పాల్గొనేందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులము ఎప్పుడు ముందుంటామని అన్నారు..ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -