బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..

221
- Advertisement -

బోనాల జాతర భాగ్యనగరంలో అత్యంత వైభవంగా జరుగుతోంది. సింహవాహిణి మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి కవిత బంగారు బోనం సమర్పించారు.

తన నివాసం నుండి భారీ ర్యాలీగా తరలివచ్చారు కవిత. సికింద్రాబాద్ లో గజమాలతో ఘనస్వాగతం పలికారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. అనంతరం పద్మారావు గౌడ్ నుండి బంగారు బోనంతో బయలుదేరి అమ్మవారికి సమర్పించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆలయాలకు ప్రభుత్వం నిధులు ఇస్తోందని తెలిపారు.  అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Also Read:గోపిచంద్ – రవితేజ@ 4

- Advertisement -