బాలయ్య ‘సారీ ‘ చెప్తారా ?

63
- Advertisement -

నటసింహా నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థం కాదు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ కొన్ని సార్లు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. గతంలో కూడా ఎన్నోసార్లు బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇక తాజాగా ఆయన మరోసారి కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేశారు. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన బాలయ్య మూవీ వీరసింహరెడ్డి సక్సస్ ఈవెంట్ లో అక్కినేని, ఎస్వీ రంగరావు లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘ ఆ రంగరావు.. ఈ రంగరావు.. అక్కినేని తొక్కినేని ” అంటూ బాలయ్య కామెంట్స్ చేయడంతో అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇక అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ కూడా బాలయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు.

” ఎన్‌టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌వి రంగరావు.. కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌర పరచడం మనల్ని మనమే కించపరచుకోవడమే అవుతుంది అంటూ అక్కినేని వారసులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంచితే బాలయ్య తాను చేసిన వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుతూ టీడీపీ కాపునాడు అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 25 లోగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని లేకపోతే లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే బాలయ్య ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీలో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో రామ్ చరణ్ విషయంలోనూ, అలాగే పవన్ కల్యాణ్ విషయంలోనూ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికి కొన్ని సార్లు బాలయ్య చేసే వ్యాఖ్యలు కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. మరి బాలయ్య ఈ కాంట్రవర్సీకి ఎలా పులిస్టాప్ పెడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -