అమెరికాలో ఆగని కాల్పుల మోత..

18
- Advertisement -

కాల్పుల మోతతో అమెరికా దద్దరిల్లిపోతోంది. తాజాగా వాషింగ్టన్ స్టేట్‌లోని యకిమా నగరంలోని కన్వీనియన్స్ స్టోర్‌లో కాల్పులు జరిగాయి.  ఒక్కసారిగా 21 మందిపై కాల్పులకు తెగబడ్డాడు ఆగాంతకుడు. ఆ తర్వాత సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడని పేర్కొన్నారు. దాదాపు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కాల్పులకు సంబంధించి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గరు మృతిచెందారు. కొంతమంది గాయపడ్డారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తికి మృతుల మధ్య ఎలాంటి ఘర్షణ జరుగలేదని పోలీసు అధికారులు తెలిపారు. షాపింగ్‌ మాల్స్‌, పార్టీలు జరిగే ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి కాల్పులకు తెగబడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సోమవారం జరిగిన కాల్పుల్లో 11 మంది మృత్యువాతపడగా.. మంగళవారం ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -