ఆసీస్‌తో తొలి టీ20లో కోహ్లీ సేన గెలుపు…

166
ind
- Advertisement -

ఆసీస్‌తో వన్డే సిరీస్‌ కొల్పోయిన భారత్…టీ20 సిరీస్‌లో అదరగొట్టింది. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 162 పరుగుల లక్ష్యచేధనలో ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 150 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో డార్సీ షార్ట్‌ 34, ఫించ్‌ 35,స్మిత్‌ 12, హెన్రిక్స్‌ 30 పరుగులతో రాణించారు.

అంతకముందు టాస్ గెలిచిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (23 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. ఇక భారత విజయంలో కీలకపాత్ర పోషించారు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (3/25). మూడు కీలక వికెట్లు పడగొట్టి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. రెండో వన్డే ఆదివారం(రేపు) జరగనుంది.

- Advertisement -