బాబు ఫేక్ ప్రచారాన్ని నమ్మోద్దు:జగన్

10
- Advertisement -

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మోద్దన్నారు ఏపీ సీఎం జగన్. హిందుపూర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన జగన్…చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ప్రజలకు భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునే వాడు కాదని తేల్చిచెప్పారు. చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ పై కనీస అవగాహన లేదని, ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

భూములపై ప్రజలకు సర్వహక్కులు కల్పించేదే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ అని …దేశంలోనే ఇది పెద్ద సంస్కరణ కాబోతోందన్నారు. వందేళ్ల తర్వాత మళ్లీ భూసర్వే చేయించి.. సరిహద్దు రాళ్లు పెట్టిస్తున్నానన్నారు. ఇప్పటి వరకు 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.

Also Read:ఇంట్లో ఉండే వారికి వడదెబ్బ..జాగ్రత్త!

- Advertisement -