- Advertisement -
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రంగనాథ్కు రూ.50 వేల జరిమానా విధించింది తెలంగాణ హైకోర్టు.జరిమానా కడితేనే అఫిడవిట్ అంగీకరించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ మండలం యూసుఫ్గూడ పరిధిలోని సర్వే నంబర్ 45(హనుమాన్ టెంపుల్ వెనుక)లో ఉన్న భూమిపై స్టేటస్ కో ఉన్నప్పటికీ, కాంపౌండ్ వాల్ కూలగొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బోర్డు ఏర్పాటు చేసింది హైడ్రా.
కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇచ్చినా పట్టించుకోకుండా, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది తెలంగాణ హైకోర్టు. జరిమానా కడితేనే కౌంటర్ అఫిడవిట్ అంగీకరించాలని రిజిస్ట్రీని ఆదేశించారు హైకోర్టు న్యాయమూర్తి.
Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?
- Advertisement -

