దేశంలో ఉగ్రదాడులు..నిఘావర్గాల హెచ్చరిక

206
india
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో తనిఖీలను విస్తృతం చేశారు.

ఢిల్లీలోని అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీ చేరుకునే మార్గాలలో వాహనాల సోదాలు చేస్తున్న పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

ఉగ్రవాదులు జమ్మూ క‌శ్మీర్ నుంచి దొంగచాటుగా ట్రక్‌లో ఢిల్లీ చేరుకున్నట్లు నిఘావర్గాల సమాచారం అందించాయి. దీంతో ఢిల్లీలో అధికారులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

- Advertisement -