- Advertisement -
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయబావుటా ఎగురవేసింది. గతంలో కంటే ఎక్కువ స్ధానాలు సాధించిన బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా ద్వయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
బీజేపీకి ప్రజలు తిరుగులేని మెజార్టీని అందించారని చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పిన కేటీఆర్ ..ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -