శుభకృత్…ప్రజలకు శుభం కలగాలి: సీఎం కేసీఆర్

91
kcr
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్‌’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుషలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. అనతికాలంలోనే అన్ని రంగాలను పటిష్ట పరుచుకున్నామని, ‘శుభకృత్‌’ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని సీఎం అన్నారు.

కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జీడీపీకి దోహదపడటంలో ముందున్నదని తెలిపారు. తెలంగాణ ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంలో.. వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోషిస్తున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని తెలిపారు.

- Advertisement -