CJP:20న మరో నిరసన..వివరాలివే

3
- Advertisement -

పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 20న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఢిల్లీ పోలీసుల అనుమతి కోరింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద నిరవధిక ధర్నా చేపడతామని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే గతంలోనే ప్రకటించారు. జూన్ 17న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. పోలీసులకు అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశామని నిరసనలో పాల్గొనే వాలంటీర్ల సంఖ్య మరియు ఇతర ఏర్పాట్ల వివరాలను సమర్పించినట్లు పార్టీ తెలిపింది.

జూన్ 20, 2026న జంతర్ మంతర్ వద్ద శాంతియుత ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించనున్నట్లు మేము ఢిల్లీ పోలీసులకు అధికారికంగా తెలియజేశాము. …వారు ఖచ్చితంగా అనుమతి ఇస్తారనే నమ్మకం మాకుంది అని సిజెపి ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. నిరసన పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందని… దేశం నలుమూలల నుండి ప్రజలు ఇందులో పాల్గొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తారని ఆయన చెప్పారు.

కాక్రోచ్ జనతా పార్టీ (CJP)… నిరుద్యోగం, పరీక్షల అక్రమాలు మరియు ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం వంటి అంశాలపై పోరాడుతోంది. జూన్ 6న జంతర్ మంతర్ వద్ద వీరు నిర్వహించిన మొదటి నిరసనకు వేలాది మంది హాజరయ్యారు. ఆ తర్వాత లక్నో, పూణే, బెంగళూరు, అమృత్‌సర్ మరియు నాగ్‌పూర్‌లలో కూడా ఇటువంటి నిరసనలు జరిగాయి. ముఖ్యంగా NEET వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన వివాదాలపై వీరు ప్రధానంగా దృష్టి సారించారు.

Also Read:2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ను భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా తాత్కాలికంగా నిషేధించింది. పేపర్ లీకేజీలు, కాపీయింగ్ ముఠాల వ్యవహారాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన ప్రత్యక్ష సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే NEET (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ (మళ్లీ నిర్వహించే పరీక్ష) దృష్ట్యా జూన్ 22 వరకు ఈ యాప్‌పై సస్పెన్షన్ కొనసాగనుంది.

- Advertisement -