దెబ్బలు తిన్న సీఎం ఎక్కడో తెలుసా…

185
- Advertisement -

మీలో ఏవరైనా కొరడా దెబ్బలు తిన్నారా… తినలేదంటే రండి తినిపిస్తారు. ఎక్కడో తెలుసా…ఛత్తీస్‌ గఢ్‌ లోని జజన్‌గురి కుమ్హారి గ్రామాల్లో తినిపిస్తారు. తాజాగా ఛత్తీస్‌ గఢ్‌  ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కూడా కొరడా దెబ్బలు తిన్నారు.

దీపావళి మరుసటి రోజు ఛత్తీస్‌ గఢ్‌లో గౌరి-గౌర పూజ నిర్వహిస్తారు. ఈ జానపద సంప్రదాయాన్ని సీఎం ప్రతి ఏడాది పాటిస్తారు. ఈసారి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దానిలో భాగంగా చెడును తరిమికొట్టేందుకు కొరడా దెబ్బలు కొడతారు. అన్ని విఘ్నాలు తొలగేందుకు రాష్ట్ర ప్రజల కోసం భూపేశ్‌ ఈ పూజల్లో పాల్గొని మణికట్టుపై కొరడా దెబ్బలు తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను సీఎం ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు.

- Advertisement -