మట్టికుస్తీతో వస్తున్న విష్ణు విశాల్‌

93
- Advertisement -

కోలివుడ్‌ యంగ్‌ టాలెంట్‌డ్‌ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గట్టా కుస్తీ. తెలుగు, తమిళంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. కాగా తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రిలీజ్‌ కానుంది. చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుంటుంది.

మట్టికుస్తీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా రిలీజైన పోస్టర్‌లో విష్ణు కుస్తీ పోటీకి సిద్ధమైనట్లు ఉంది. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విష్ణు విశాల్‌ స్టూడీయోస్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లపై విష్ణు విశాల్‌ రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విష్ణు విశాల్‌కు జోడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

తెల్ల దొరకు తెలుగు ఆవకాయ రుచి చూపించిన మెగాస్టార్

బడ్జెట్ 16 కోట్లు..వసూళ్లు 300 కోట్లు!

అన్‌స్టాపబుల్…రికార్డులు బ్రేక్!

- Advertisement -