ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా

4
- Advertisement -

తెలంగాణ లో బీసీ ల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని ఏప్రిల్ 2 వ తేదీ ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నా లో పాల్గొనీ సంఘీభావం తెలపనున్నారు ఏఐసీసీ అగ్రనేత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇతర మంత్రులు,బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్,బిర్ల ఐలయ్య,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి , ఈర్లపల్లి శంకరయ్య , అన్ని రాజకీయ పార్టీల నేతలు , ప్రతిపక్ష పార్టీల ఎంపీలు.

తెలంగాణ శాసన సభలో ఇటీవల బీసీ లకు రాజకీయ ,విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చేసిన చట్టాన్ని 9 వ షెడ్యూల్ చేర్చాలని ఏప్రిల్ 2,3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను , వివిధ పార్టీల నాయకులను కలిసి తెలంగాణ చేసిన కుల సర్వే వివరాలు చెప్పి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టానికి మద్దతు ఇవ్వాలని కోరనుంది తెలంగాణ మంత్రుల బృందం. ఏప్రిల్ 2,3 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారంతో వివిధ పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు కు మద్దతు కోరనుంది తెలంగాణ కాంగ్రెస్ బృందం.

Also Read:హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు..అప్‌డేట్

- Advertisement -