2024-25 కి గాను kp.2 వేల కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేసినందుకు GHMC సెలబ్రేషన్స్ చేసుకుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ .. బంజారా భవన్ లో జరిగిన కార్యక్రమం లో జీహెచ్ఎంసీ కమిషనర్, ఉన్నతాధికారులు, ట్యాక్స్ విభాగం ఉద్యోగులు పాల్గొన్నారు.
జిహెచ్ఎంసి రెవెన్యూ, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు సన్మానం చేసి, అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందజేశారు కమిషనర్ ఇలంబర్తి. ఈ సందర్బంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ.. 2 వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంలో ఫీల్డ్ లెవెల్ అధికారులు బాగా పని చేశారు అన్నారు.
2025-26 కి గాను 3 వేల కోట్ల టార్గెట్ తో ముందుకు వెళ్తున్నాం అని… ఎస్టేట్స్ విభాగం నుంచి కూడా ఈసారి రెవెన్యూ పెరిగిందని తెలిపారేఉ. ట్యాక్స్ కలెక్షన్ పెరిగితే జీహెచ్ఎంసీ లో మరిన్ని పనులు చేపట్టవచ్చు అన్నారు.
Also Read:నయీం కేసులో ఈడీ దూకుడు..

