KTR:హైద‌రాబాద్‌లో జాప్‌కామ్ సెంట‌ర్

51
- Advertisement -

అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్..భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారు. తాజాగా అమెరికాకు చెందిన ప్రొడ‌క్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూష‌న్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు(ZapCom Group) కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన భేటీలో జాప్‌కామ్ వ్య‌వస్థాప‌కుడు, సీఈవో కిషోర్ ప‌ల్ల‌మ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ చ‌ర్చించారు. ట్రావెల్‌, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్‌, రిటేల్ రంగాల్లో కీల‌క‌మైన ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్ప‌త్తుల‌ను జాప్‌కామ్‌ కంపెనీ రూపొందించ‌నుంది.

Also Read:బ్యాక్ టూ కాంగ్రెస్ ?

కాలిఫోర్నియా, టెక్సాస్‌, ఫ్లోరిడాతో పాటు సెంట్ర‌ల్ అమెరికా, ఇండియాలోనూ ఆ కంపెనీకి ఆఫీసులు ఉన్నాయి. హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌నున్న జాప్‌కామ్ కంపెనీ తొలుత 500 మందికి ఉద్యోగాలు ఆ త‌ర్వాత ఏడాదిలోగా మ‌రో వెయ్యి మందికి ఉద్యోగాలు క‌ల్పించనుందని కేటీఆర్ వెల్లడించారు.

Also Read:Vijayendra Prasad:అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్‌కే సాధ్యం

- Advertisement -