KTR:ఇంకా కాంగ్రెస్‌ను నమ్ముదామా?

5
- Advertisement -

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 5 నెలల కింద కేసీఆర్ ఇక్కడికి వచ్చారు…కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని అప్పుడు కేసీఆర్ చెప్పారు.ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందో చూశారు కదా? అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని భైంసాలో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన కేటీఆర్..రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిండన్నారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు అని చెప్పిండు…రేవంత్ రెడ్డి చెప్పిన హామీల్లో ఒక్క హామీ అన్న అమలైందా? ఆలోచించాలన్నారు.

ఇంకా కాంగ్రెస్ ను నమ్ముదామా? మళ్లీ వాళ్లకే ఓటు వేద్దామా?,ఆత్రం సక్కు సీనియర్ నాయకులు. ఆదివాసీల కోసం ఎంతో కృషి చేశారన్నారు.కాంగ్రెస్ పార్టీ వాళ్లు 5 నెలల్లో చాలా హామీలిచ్చి మనల్ని మోసం చేశారు…నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. పదేళ్ల క్రితం ఎన్నో డైలాగులు చెప్పి బీజేపీ వాళ్లు కూడా లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు…కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా…మీరు 13 తారీఖు నాడు సక్కు ని కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించండన్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం సరైన వ్యక్తులకు అవకాశం ఇవ్వలేకపోయాం. మన పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు పోనివ్వడి. చెత్తంతా పోతోంది..బీజేపీ వాళ్లు ఏమైనా అంటే నమో అంటారు. నమో అంటే నరేంద్రమోడీ కాదు నమ్మించి మోసం చేసే వ్యక్తి అని దుయ్యబట్టారు. పదేళ్లలో దేశానికి గాని ఆదిలాబాద్ కు గానీ ప్రధాని ఒక్క పనిచేయలే..ఆదిలాబాద్ లో సీసీఐ ను ఓపెన్ చేయలే. బీజేపీ ఎంపీ ముధోల్ తాలుకాలో ఒక్కటంటే ఒక్క పని చేయలే అన్నారు.

Also Read:KCR:బండి సంజయ్‌తో పైసా పనికాదు?

- Advertisement -