దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థుల నిరసనల్లో పాల్గొని, వేధింపులకు గురవుతున్న విద్యార్థులకు న్యాయ మరియు ఇతర సహాయం అందించేందుకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) ప్రారంభించిన హెల్ప్లైన్ నంబర్కు మంచి స్పందనవస్తోంది.
2026 జూలై 27న ఈ హెల్ప్లైన్ను అందుబాటులోకి తెచ్చారు. కాల్ చేసిన వారిలో అత్యధికులు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వేధింపులు, పోలీసు చర్యల నుంచి రక్షణ కోరారు. బాధితుల్లో ఎక్కువమంది మహిళా విద్యార్థినులు ఉండటంతో వారిపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు యూత్ కాంగ్రెస్ ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది.
హెల్ప్లైన్ ప్రారంభించిన మొదటి రోజే 1,080 కాల్స్ వచ్చాయని అందులో 55 మంది విద్యార్థులకు తక్షణ చట్టపరమైన సాయం అందించామని నాయకులు తెలిపారు. బీహార్ రాష్ట్రం నుండి ఎక్కువ కాల్స్ వచ్చాయి. పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) మరియు నిఘా పరికరాలను ఉపయోగిస్తుండటంతో, భయపడుతున్న తమ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు కూడా విద్యార్థులు ఈ హెల్ప్లైన్ను సంప్రదించారు.
మహిళా విద్యార్థులను ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్న విద్వేషపూరిత సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి, సంబంధిత నెట్వర్క్ ప్లాట్ఫామ్లకు ఫిర్యాదు చేస్తున్నారు.జంతర్ మంతర్ వద్ద ప్రధాని కార్యాలయాన్ని (PMO) అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జూలై 23న రుచికా సింగ్పై యూపీ పోలీసులు నమోదు చేసిన కేసును కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
ఇటీవల బీహార్లో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ వేసిన కమిటీలో భాగంగా ఐవైసీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ భాగల్పూర్ను సందర్శించారు.భయంతో చాలామంది యువ విద్యార్థులు ఇళ్లను వదిలి వెళ్లారు. తమ పిల్లలు ఎక్కడున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హక్కుల కోసం గొంతు విప్పడం ప్రజాస్వామ్య హక్కు. ఏ విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా, యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి అండగా నిలుస్తుంది అని స్పష్టం చేశారు.
Also Read:తెలంగాణ అంటే తాగుడు కాదు!

