బాలయ్య కోసం రెండు సెట్లు

40
- Advertisement -

నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి రాబోయే సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ కానున్న క్రేజీ కమర్షియల్ మూవీ. ఈ చిత్రం జనవరి 12, 2023న విడుదలవుతోంది. ఇటీవలే విడుదలైన సింగిల్, సుగుణ సుందరి మ్యూజిక్ చార్ట్‌లలో దూసుకుపోతున్నాయి.

కాగా, వీరసింహారెడ్డి చివరి పాట షూటింగ్ డిసెంబర్ 21 నుంచి బాలకృష్ణ, శృతి హాసన్‌లపై జరగనుంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రెండు భారీ సెట్‌లను సిద్ధం చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జరగనుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. వాల్తేర్ వీరయ్య, , వారసుడు సినిమాలతో సంక్రాంతికి ఈ సినిమా క్లాష్ అవుతోంది. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి  కూడా చదవండి…

బాలయ్యతో వై.ఎస్ షర్మిల ముచ్చట్లు

అన్‌స్టాపబుల్..సల్మాన్‌ తర్వాతే పెళ్లి!

#NBK108… శరత్ కుమార్

- Advertisement -