బాలయ్య అప్పుడే హాఫ్ మిలియన్ !

38
- Advertisement -

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి రేపే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ కమర్షియల్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లతో వార్తల్లో నిలిచింది.

US బాక్సాఫీస్ వద్ద కేవలం ప్రీ-సేల్స్‌తో $525K దాటింది. నిన్న రాత్రి  ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి ఈ సినిమా ఓవర్ సీస్ బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు వసూళ్లు సాధిస్తుందో అనేది హాట్ టాపిక్ అవుతుంది. రిలీజ్ కి ముందే హాఫ్ మిలియన్ సాదించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత అవలీలగా మిలియన్ డాలర్ కలెక్షన్స్ దాటేయడం ఖాయమని అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -