సంక్రాంతి సినిమాలకు ఎంత పెంచారు?

33
- Advertisement -

సంక్రాంతి సినిమాలకు టికెట్టు ధరలు పెంచాలని ఇరు ప్రభుత్వాలను కలిశారు మైత్రి నిర్మాతలు. అయితే సంక్రాంతి సినిమా టిక్కెట్ల పెంపుపై ఆశలు పెట్టుకున్న చిరంజీవి, బాలకృష్ణలకు ఏపీ ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. వీరసింహా రెడ్డి ,వాల్తేరు వీరయ్య నిర్మాతలు ఈ చిత్రాలకు 75 రూపాయలు పెంచాలని కోరారు. 45 పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని మొదట్లో వినిపించింది. అయితే అసలు ఏపీ ప్రభుత్వం నుండి ఈ సినిమాల టికెట్ల పెంపుకు జీవో వస్తుందా ? అనే అనుమానాలు కలిగాయి।

ఎట్టకేలకు చివరి నిమిషంలో వాల్తేరు వీరయ్యకు 25 రూపాయలు, వీరసింహారెడ్డికి రా 20 రూపాయలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సంక్రాంతి అంటే సినిమాల పండుగ. కుటుంబాలు థియేటర్స్ కి తరిలి కోట్లు కుమ్మరించే సీజన్. అందుకే ఈసారి, సీనియర్ హీరోలు చిరు మరియు బాలయ్య AP ప్రభుత్వం నుండి సహాయం కోసం ఆశించారు, కానీ అది జరగలేదు. చాలా తర్జనభర్జనలు, జాప్యం తర్వాత జగన్ ప్రభుత్వం రూ.25, 20 పెంపుదలకు అనుమతినిచ్చింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -