ప్చ్.. పాన్ ఇండియా పిచ్చి ముదిరింది

24
- Advertisement -

రాజమౌళి “బాహుబలి” చిత్రాలతో తెలుగు హీరోలకి “పాన్ ఇండియా” పిచ్చి పట్టించాడు. దీనికితోడు “ఆర్ఆర్ఆర్”తో ఆస్కార్ కలలను కనేలా కూడా ప్రోత్సాహం ఇచ్చాడు. మొత్తానికి సౌత్ లో పది మంది స్టార్ హీరోలు ఉంటే.. అందులో ఏడు ఎనిమిది మంది తాము పాన్ ఇండియా స్టార్లం అని డప్పు కొట్టించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు విషయానికి వద్దాం. అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోనే. డౌట్ అక్కర్లేదు. కానీ, ఆయన గారు తాను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని ఫిక్స్ అయ్యారు. పైగా తన మార్కెట్ బాగా పెరిగింది అనేది అల్లు అర్జున్ నమ్మకం.

ఎలాగూ ఎదురు డబ్బులు ఇచ్చి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా దక్కించుకున్నాడు. అటు పెయిడ్ ప్రమోషన్స్ తో తెలుగు సినిమా రంగంలోనే కొత్త చరిత్ర లిఖించిన అల్లు అర్జున్ అంటూ మోత మోగించాడు. మొత్తమ్మీద బన్నీ తనను తానూ విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. వాస్తవానికి పుష్ప సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. అలాంటిది భారీ రికార్డులు బ్రేక్ చేసింది అంటూ పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఒక్క బన్నీకే చెల్లింది. ఈ ఊపులోనే పలువురు స్టార్ దర్శకులతో సినిమాలు చేసేందుకు బన్నీ తెగ చర్చలు జరుపుతున్నాడు. రీసెంట్ గా రాజమౌళిని కూడా తనతో ఓ సినిమా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు.

Also Read:షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్!

మహేష్ తో సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆల్ రెడీ రాజమౌళి ఫిక్స్ అయిపోయాడు. సో.. బన్నీకి సున్నితంగా నో చెప్పినట్లు టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప 2” షూటింగ్లో ఉన్నారు. “పుష్ప 2” తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయాలి అనేది బన్నీ ఆలోచన. అందుకే, రాజమౌళిని అడిగాడు. అక్కడ నుంచి నో అని వచ్చింది. ఈ క్రమంలోనే దర్శకుడు అట్లీ వెంట పడ్డాడు. కానీ, అట్లీ బన్నీతో ఇప్పుడు మూవీ చేసే ఛాన్స్ లేదు. అట్లీకి వేరే కమిట్ మెంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో “జైలర్” దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. మొత్తమ్మీద పాన్ ఇండియా పిచ్చి ముదిరింది.

Also Read:పిక్ టాక్ : అందాలతో అదరగొట్టింది

- Advertisement -