ఎన్సీపీ అధినేతకు బెదిరింపు మెసేజ్‌..

23
- Advertisement -

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామని బెదిరింపులు వచ్చాయని శరద్‌ పవార్ కుమార్తె ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఈ మేరకు ముంబై పోలీసు కమిషనర్‌ను కలిసి పిర్యాదు చేశారు. వాట్సాప్ ద్వారా బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు అందులో పేర్కొన్నారు. అగంతకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ…పవార్‌ను బెదిరిస్తూ వాట్సాప్‌లో తనకు మెసేజ్ వచ్చిందని పోలీసులకు పిర్యాద చేసేందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ విషయంలో మహారాష్ట్ర హోం మంత్రి కేంద్ర హోం మంత్రి సత్వరం చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ సోదరుడు సునీల్‌ రౌత్‌కు కూడా ఇలాంటి మెసేజ్‌లు వచ్చినట్టు తెలిపారు. మీడియా ముందు మాట్లాదవద్దంటూ తమకు బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు ఎమ్మెల్యే సునీల్‌ రౌతౌ తెలిపారు.

Also Read: Odisha:బహనాగ హైస్కూల్‌ కూల్చివేత..

మహారాష్ట్ర సీఎం ఎక్‌ నాథ్ షిండే స్పందిస్తూ పోలీసు ఉన్నాతాధికారులతో మాట్లాడామని వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శరద్‌ పవార్‌ కు ఇలాంటి మెసేజ్‌లు రావడం చాలా బాధాకరమన్నారు. వెంటనే సత్వరమే చర్యలు తీసకుంటున్నట్టు తెలిపారు.

Also Read: బీసీల్లోని వృత్తికులాలకు ఆర్థికసాయం..

- Advertisement -