స్టాక్ మార్కెట్లపై ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, విమాన ప్రమాదం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. భారీ నష్టాల్లో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద ముగిసింది సెన్సెక్స్. 170 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద ముగిసింది నిఫ్టీ.
శుక్రవారం ఉదయం, ఇజ్రాయేల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై న్యూక్లియర్ సదుపాయాలపై దాడులు ప్రారంభించింది. ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను మరియు బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ హొసైన్ సలామీ మృతి చెందారని నివేదికలు తెలిపాయి.
ఇజ్రాయేల్ దాడుల తరువాత, ఇరాన్ డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నూనె ధరలు 10 శాతం పైగా పెరిగాయి. అలాగే గురువారం అహ్మదాబాద్లో Air India బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ప్రమాదం కూడా మార్కెట్ సెంటిమెంట్ను మరింత ప్రభావితం చేసింది.
Also Read:KTR:పల్లాను పరామర్శించిన కేటీఆర్

