మరోసారి ఈడీ ముందుకు సోనియా

94
sonia
- Advertisement -

ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఎదుట హాజరవనున్నారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం సోనియా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సోనియాతో పాటు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ కేసులో ఇప్పటికే ఈ నెల 21న ఈడీ సోనియాను రెండు గంటల పాటు ప్రశ్నించింది. నేషనల్‌ హెరాల్డ్‌ యాజమాన్యంలోని యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణ జరుపుతోంది.

- Advertisement -